Share News

టీడీపీ గెలుపును ఎవరూ ఆపలేరు

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:58 AM

త్వరలో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపునూ ఎవరూ ఆపలేరని, డ్రామాల జగన్‌కు ఓటుతోనే బుద్ధి చెప్పాలని పత్తికొండ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబు అన్నారు.

టీడీపీ గెలుపును ఎవరూ ఆపలేరు
కేఈ సమక్షంలో పార్టీలో చేరిన శ్రీరంగాపురం వాసులు

తుగ్గలి, ఏప్రిల్‌ 17: త్వరలో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపునూ ఎవరూ ఆపలేరని, డ్రామాల జగన్‌కు ఓటుతోనే బుద్ధి చెప్పాలని పత్తికొండ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబు అన్నారు. బుధవారం రాతన కొత్తూరులో ఆంజనేయస్వామి నూతన దేవాలయం ప్రారంభోత్సవ వేడుకల్లో కేఈ పాల్గొని ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థులందరూ చేయి చేయి కలిపి ఆంజనేయస్వామి దేవాలయం నిర్మించడం ఎంతో సంతోషంగా ఉందని, ఆలయ అభివృద్ధి కోసం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు మనోహర్‌ చౌదరి, ఈరన్నస్వామి, పాండు, వాల్మీకి సంఘం నాయకులు కోటేశ్వరయ్య, తదితరులు పాల్గొన్నారు.

టీడీపీలో చేరిన శ్రీరంగాపురం గ్రామస్థులు

వెల్దుర్తి : స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్తికొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ.శ్యాంబాబు సమక్షంలో బుధవారం శ్రీరంగాపురం గ్రామస్థులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేఈ.శ్యాంబాబు మాట్లాడుతూ ఒక్క చాన్స్‌ అంటూ సీఎం జగన్‌రెడ్డి రాష్ట్రాన్ని పాతాళంలోకి నెట్టారని విమర్శించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం డ్రగ్స్‌, గంజాయిలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మార్చారన్నారు. మళ్లీ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే చంద్రబాబు నాయుడితోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. టీడీపీలో చేరిన వారిలో కోటేశ్వరయాదవ్‌, మాజీ ఎంపీటీసీ హనుమంతు, బాల చిన్న రంగస్వామి, మేకల రామచంద్రుడు, శివ, సుధాకర్‌, రవికుమార్‌, శేఖర్‌, రామచంద్రుడు ఉన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 12:58 AM