శ్రీవారి సేవలో సింధు దంపతులు
ABN , Publish Date - Dec 28 , 2024 | 04:59 AM
నూతన దంపతులు, స్టార్ షట్లర్ పీవీ సింధు, వెంకట దత్తసాయి శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సులు అందుకున్నారు.

తిరుమల, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): నూతన దంపతులు, స్టార్ షట్లర్ పీవీ సింధు, వెంకట దత్తసాయి శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సులు అందుకున్నారు. ఇటీవల ఏడడుగులు వేసి ఒక్కటైన ఈ జంట గురువారం రాత్రి కాలినడకన తిరుమల చేరుకున్నారు. శుక్రవారం వేకువజాము జరిగిన అభిషేక సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు.