కొత్తపంట రుణాలు ఇవ్వాలి
ABN , Publish Date - May 23 , 2024 | 11:23 PM
ఖరీఫ్ సీజన్లో రైతులకు కొత్తరుణాలు ఇవ్వాలని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఎదుట గురువారం ధర్నా చేశారు.
![కొత్తపంట రుణాలు ఇవ్వాలి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
దేవనకొండ ,మే 23 : ఖరీఫ్ సీజన్లో రైతులకు కొత్తరుణాలు ఇవ్వాలని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఎదుట గురువారం ధర్నా చేశారు. మండలంలో చాలా మంది రైతులు రుణాలు రాక బయట వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి నష్టపోతున్నారని ఆ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి మునిస్వామి అన్నారు. కొత్తరుణం కోసం వచ్చే ప్రతి రైతుకు రుణాలు మంజూరు చేయాలని మేనేజరు విజయ్భాస్కర్కు విన్నతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో శ్రీనివాసులు, ధర్మా , రాము, కృష్ణ, రంగస్వామి, వీరన్న పాల్గొన్నారు.