Share News

ఇంజనీరింగ్‌ కళాశాలలో వైసీపీ ప్రచారం

ABN , Publish Date - May 07 , 2024 | 06:17 AM

ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఇంజనీరింగ్‌ కళాశాలను అధికార వైసీపీ ఎన్నికల ప్రచార వేదికగా మార్చేసింది.

ఇంజనీరింగ్‌ కళాశాలలో వైసీపీ ప్రచారం

గూడూరు అర్బన్‌, మే 6: ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఇంజనీరింగ్‌ కళాశాలను అధికార వైసీపీ ఎన్నికల ప్రచార వేదికగా మార్చేసింది. తిరుపతి జిల్లా గూడూరులోని ఆదిశంకర ఇంజనీరింగ్‌ కళాశాలలో సోమవారం యూత్‌ ఎంపవర్‌మెంట్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. నెల్లూరు ఎంపీ వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ముఖ్యఅతిథిగా ‘సాధికారత, స్థిరత్వంపై’ విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమం రాజకీయ వేదికగా మారింది. సమావేశంలో విద్యార్థులు విజయసాయిరెడ్డి మాస్కులను ధరించడం, ఓ అధ్యాపకుడు విజయసాయిరెడ్డికి రాజకీయ ప్రచారం చేయడం, దిశ చట్టానికి చెందిన సభ్యురాలు జై జగన్‌ నినాదాలు చేయడం, వైసీపీ పాటలు వేయడంపై విమర్శలు వచ్చాయి.

Updated Date - May 07 , 2024 | 06:17 AM