Share News

నా కొడకా..నువ్వు తిరుగుతావేం రా..

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:59 PM

రేయ్‌ నా కొడకా.. ఇక్క డ నువ్వు తిరుగుతావేం రా..నువ్వు నాన లోకల్‌, ఇక్కడ ఎలా పోటీ చేస్తావ్‌ రా..నీ కథ చూ స్తామంటూ అఽధికార వైసీపీ నాయకులు తన ను బెదిరించారని రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్ధి షేక్‌ బషీద్‌ ఆవే దన వ్యక్తం చేశారు.

నా కొడకా..నువ్వు తిరుగుతావేం రా..
బి కొత్తకోటలో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి బషీద్‌

వైసీపీ వారు బెదిరించారంటూ రాజంపేట కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి బషీద్‌ ఆవేదన

వైసీపీని ఓడించకపోతే ఎవరి ప్రాణానికి గ్యారంటీ లేదని వ్యాఖ్య

బి.కొత్తకోట, ఏప్రిల్‌27: రేయ్‌ నా కొడకా.. ఇక్క డ నువ్వు తిరుగుతావేం రా..నువ్వు నాన లోకల్‌, ఇక్కడ ఎలా పోటీ చేస్తావ్‌ రా..నీ కథ చూ స్తామంటూ అఽధికార వైసీపీ నాయకులు తన ను బెదిరించారని రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్ధి షేక్‌ బషీద్‌ ఆవే దన వ్యక్తం చేశారు. ఎన్నికల కోసం క్యాడర్‌ను సన్నధ్దం చేయడంలో భాగంగా శనివారం ఆయ న బి.కొత్తకోటలో పర్యటించారు. తంబళ్లపల్లె నియోజకవర్గ అభ్యర్థి ఎంయన చంద్రశేఖర్‌రెడ్డి పార్టీ కార్యాలయంలో కార్యకర.్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకుల వ్యవహారశైలి పై మం డిపడ్డారు. రాజంపేట పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోనూ వాట్స ప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి, ఎక్కడ సమస్య వున్నా వెంటనే స్పందిస్తామన్నారు. వైయస్‌ షర్మిల నాయకత్వాన్ని బలపరచాలని కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అసెంబ్లీ అభ్యర్థి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆస్తులు, సహజవనరుల రక్షణ కోసం వైసీపీ ని ఓడించాల న్నారు. జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు అల్లాబకష్‌, క్రిష్నారెడ్డి, రవూఫ్‌, శ్రీకాంతరెడ్డి, రఘునాథ్‌, బషీర్‌ సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 11:59 PM