Share News

వైసీపీ ర్యాలీలో పాల్గొన్నవారికీ మస్టర్లు!

ABN , Publish Date - Apr 27 , 2024 | 04:14 AM

వైసీపీ అభ్యర్థి నామినేషన్‌ కార్యక్రమానికి హాజరైనవారికి ఉపాధి పనులు చేసినట్లు మస్టర్లు ఎలా వేస్తారని ప్రశ్నించిన పంగిలి సర్పంచి భర్త కూకటి పెంచలయ్యపై ఎంపీడీవో సమక్షంలోనే ఉపాధి మేట్‌ మదిరా సుబ్బయ్య,

వైసీపీ ర్యాలీలో పాల్గొన్నవారికీ మస్టర్లు!

‘ఉపాధి’లో అవినీతిపై సర్పంచి భర్త ఫిర్యాదు

ఎంపీడీఓ సమక్షంలోనే ఆయనపై దాడి చేసిన వైసీపీ నేత

రాపూరు(డక్కిలి), ఏప్రిల్‌ 26: వైసీపీ అభ్యర్థి నామినేషన్‌ కార్యక్రమానికి హాజరైనవారికి ఉపాధి పనులు చేసినట్లు మస్టర్లు ఎలా వేస్తారని ప్రశ్నించిన పంగిలి సర్పంచి భర్త కూకటి పెంచలయ్యపై ఎంపీడీవో సమక్షంలోనే ఉపాధి మేట్‌ మదిరా సుబ్బయ్య, వైసీపీ నాయకుడు మదురా సుబ్బయ్య దాడిచేశారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా రాపూరు మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం చోటుచేసుకొంది. దీంతో పెంచలయ్య పోలీసులను ఆశ్రయించాడు. బాఽధితుడిని ఆసుపత్రికి పంపి కేసు నమోదు చేశారు.

Updated Date - Apr 27 , 2024 | 04:14 AM