Share News

ప్రియుడితో కలిసి భర్త హత్య

ABN , Publish Date - Feb 26 , 2024 | 03:01 AM

ప్రియుడితో ఏకాంతంగా ఉండ గా చూసిన భర్తను హత్య చేసి గుండెపోటుతో మృతి చెందినట్లు బంధువులను నమ్మించింది.

ప్రియుడితో కలిసి భర్త హత్య

గుండెపోటుగా చిత్రీకరించే యత్నం

భార్య అరెస్టు, పరారీలో ప్రియుడు

సూర్యాపేట లో ఘటన

మేళ్లచెర్వు, ఫిబ్రవరి 25: ప్రియుడితో ఏకాంతంగా ఉండ గా చూసిన భర్తను హత్య చేసి గుండెపోటుతో మృతి చెందినట్లు బంధువులను నమ్మించింది. అం త్యక్రియల సమయంలో మృతదేహంపై గాయాలను చూసిన బంధువులు భార్యను నిలదీయడంతో ఆమె బండారం బయటపడింది. సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. మేళ్లచెర్వు ఎస్‌ఐ పరమేష్‌ తెలిపిన వివరా ల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన దివ్యాంగుడు నేర్నకంటి వీరగోపయ్య(32)కు కోదాడ మండలం గణపవరం గ్రామానికి చెందిన వీరకుమారితో ఏడేళ్ల క్రితం వివాహమైం ది. వీరికి ఐదేళ్ల కుమార్తె వినీత, మూడేళ్ల కుమారుడు వినయ్‌కుమార్‌ ఉన్నారు. వీరకుమారికి గ్రామానికి చెందిన వార్డు మెంబరు భర్త ఎస్‌కే సైదాహుస్సేన్‌తో మూడేళ్ల క్రితం వివాహేతర సంబంధం ఏర్పడింది. కుటుంబసభ్యులు పలుమార్లు మందలించినా ఆమెలో మార్పు రాలేదు. శనివారం వీరగోపయ్య ఓ వివాహనికి వెళ్లి రాత్రి 11.30 గంటలకు ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో వీరకుమారి ప్రియుడు సైదాహుస్సేన్‌తో ఏకాంతంగా ఉంది. ఈ విషయం బయటకు తెలుస్తుందని ప్రియుడితో కలిసి భర్తపై దాడి చేసింది. వీరగోపయ్య కాళ్లను ప్రియుడు సైదాహుస్సేన్‌ పట్టుకోగా ముఖంపై దిండు అదిమి పట్టుకుని ఊపిరాడకుండా చేసి భర్తను హత్య చేసింది. భర్త గుండెపోటుతో ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడని బంధువులను నమ్మించింది. ఆదివారం సాయంత్రం అంత్యక్రియల ఏర్పాట్లలో భాగంగా వీరగోపయ్య మృతదేహానికి స్నానం చేయించడానికి చొక్కాను తీయగా శరీరంపై గాయాలు కనిపించాయి. అతడి బంధువులు వీరకుమారిపై దాడిచేసి నిలదీయడంతో ప్రియుడి సాయంతో భర్తను హత్య చేశానని అంగీకరించింది. వెంటనే పోలీసుల కు సమాచారం ఇచ్చారు. పోలీసులు వీరకుమారిని అదుపులోకి తీసుకోవడంతో పాటు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరగోపయ్య అక్కలు నాగలక్ష్మి, రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్ల ఎస్‌ఐ తెలిపారు. ప్రియుడు పరారీలో ఉన్నాడని చెప్పారు.

Updated Date - Feb 26 , 2024 | 08:04 AM