Share News

17న రాష్ట్రానికి మోదీ రాక

ABN , Publish Date - Mar 12 , 2024 | 02:59 AM

ప్రధాని మోదీ ఈ నెల 17వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో బీజేపీ-టీడీపీ-జనసేన ఉమ్మడిగా నిర్వహించే భారీ సభలో పాల్గొంటారు.

17న రాష్ట్రానికి మోదీ రాక

చిలకలూరిపేటలో ఉమ్మడి సభకు హాజరు

సభ విజయవంతానికి ఉమ్మడి కమిటీలు

నిడదవోలు అభ్యర్థిగా కందుల దుర్గేశ్‌

జనసేనాని పవన్‌ అధికారిక ప్రకటన

అమరావతి, మార్చి 11(ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ ఈ నెల 17వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో బీజేపీ-టీడీపీ-జనసేన ఉమ్మడిగా నిర్వహించే భారీ సభలో పాల్గొంటారు. పదేళ్ల తర్వాత మోదీ, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఒకే వేదికపైకి రానుండడంతో మూడు పార్టీల కార్యకర్తలు, అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. వాస్తవానికి 16వ తేదీన ఆయన విశాఖ వస్తారని.. బీజేపీ ర్యాలీలో పాల్గొంటారని ప్రకటన వెలువడింది. అయితే ఈ పర్యటన రద్దయిందంటూ స్థానిక బీజేపీ నేతలకు పార్టీ జాతీయ నాయకత్వం సోమవారం సాయంత్రం సమాచారమిచ్చింది. ఉమ్మడి బహిరంగ సభను విజయవంతం చేయడానికి 3 పార్టీల నుంచి 115 మంది నేతలతో 12 ఉమ్మడి కమిటీలను ఏర్పాటు చేశారు. కమిటీల వివరాలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సోమవారం రాత్రి ప్రకటించారు.

Updated Date - Mar 12 , 2024 | 07:37 AM