MLA వరదబాధితులకు దగ్గపాటి సాయం
ABN , Publish Date - Sep 10 , 2024 | 12:19 AM
ఇటీవల సంభవించిన వరదలకు కకావికలమైన విజయవాడ ప్రజలకు అనంతపురం అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ సాయమందించారు. ఆయన సోమవారం 30 టన్నుల టమోటా, 30 టన్నుల ఇతర కూరగాయలను ప్రత్యేక వాహనాల్లో విజయవాడకు పంపించారు.
అనంతపురం అర్బన, సెప్టెంబరు 9: ఇటీవల సంభవించిన వరదలకు కకావికలమైన విజయవాడ ప్రజలకు అనంతపురం అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ సాయమందించారు. ఆయన సోమవారం 30 టన్నుల టమోటా, 30 టన్నుల ఇతర కూరగాయలను ప్రత్యేక వాహనాల్లో విజయవాడకు పంపించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... విజయవాడలో వరద బాధితులకు అండగా నిలిచేందుకు తమ బృందం వెళ్లిందన్నారు. కూరగాయలతోపాటు నిత్యావసర సరుకులు, దుప్పట్లను అక్కడే కొనుగోలు చేసి పంపిణీ చేస్తామన్నారు. తన వంతుగా బాధితుల కోసం మంగళవారం సీఎం చంద్రబాబుకు ఆర్థిక సాయం అందజేస్తానన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గంగారామ్, సుధాకర్ యాదవ్, రమేష్, కృష్ణకుమార్, పోతుల లక్ష్మీనరసింహులు, బండి కాశీ విశ్వనాథ్, కురబ నారాయణస్వామి, కడియాల కొండన్న, ఓబులనాయుడు, రాజప్ప, కొండయ్య పాల్గొన్నారు.