అమరావతికి వస్తామంటున్నారు
ABN , Publish Date - Nov 16 , 2024 | 04:47 AM
గత వైసీపీ ప్రభుత్వంలో రాజధాని అమరావతిలో నిర్మాణాలకు వెనుకంజ వేసిన సంస్థలు ఇప్పుడు మళ్లీ ముందుకు వస్తున్నాయని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.
గత ప్రభుత్వంలో నిర్మాణాలకు వెనుకంజ
కూటమి ప్రభుత్వం వచ్చాక నమ్మకం వచ్చింది
సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ
అమరావతి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో రాజధాని అమరావతిలో నిర్మాణాలకు వెనుకంజ వేసిన సంస్థలు ఇప్పుడు మళ్లీ ముందుకు వస్తున్నాయని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శుక్రవారం సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు పయ్యావుల కేశవ్, నారాయణ, కందుల దుర్గేశ్, కొల్లు రవీంద్ర, టీజీ భరత్తో పాటు అధికారులు సమావేశమయ్యారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి వారికి నమ్మకం వచ్చిందని, అమరావతికి వస్తామని, నిర్మాణాలు ప్రారంభిస్తామని ముందుకొచ్చారని తెలిపారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ప్రతి పది రోజులకు ఒకసారి సబ్ కమిటీ సమావేశమవుతుందని తెలిపారు.