మంత్రి పెద్దిరెడ్డిది ధృతరాషు్ట్రడి కౌగిలి
ABN , Publish Date - Mar 18 , 2024 | 12:03 AM
రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది ధృతరాషు్ట్రడి కౌగి లి అని రాజకీయంగా ఎవ్వరిని ఎదగనీయరని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతి నిధి ఆర్జే వెంకటేశ తప్పుపట్టారు.
![మంత్రి పెద్దిరెడ్డిది ధృతరాషు్ట్రడి కౌగిలి](https://media.andhrajyothy.com/media/2024/20240313/17mpl_T7_84b0224904.gif)
రాజకీయంగా ఎవ్వరిని ఎదగనీయరు
రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేశ
మదనపల్లె టౌన, మార్చి 17: రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది ధృతరాషు్ట్రడి కౌగి లి అని రాజకీయంగా ఎవ్వరిని ఎదగనీయరని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతి నిధి ఆర్జే వెంకటేశ తప్పుపట్టారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన మా ట్లాడుతూ పెద్దిరెడ్డి రాజకీయాల్లో వచ్చిన వెం టనే పీలేరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మొఘల్ సైఫుల్లాబేగ్ను రాజకీయంగా ఎదగనీయకుండా తొక్కేశారన్నారు. ముస్లీం మైనారిటిలకు పెద్దిరెడ్డి కుటుంబం చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. పెద్దిరెడ్డి ధృతరాష్ట్ర కౌగిలిలో ఆయన కబంధ హస్తాల్లో నలిగిపోయిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు మదన పల్లెలోనే వున్నారని ఇక మిగిలింది నిస్సార్అహ్మద్ ఒక్కరే అని ఎద్దేవా చేశారు. మదన పల్లె టీడీపీ అభ్యర్థిగా షాజహానబాషాను టీడీపీ అధిష్టానం ప్రకటించగానే వైసీపీ నాయకులకు ఓటమి భయం పట్టుకుందన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు షాజ హానబాషాను అత్యధిక మెజారిటితో గెలిపిస్తారని వెంకటేశ జోస్యం చెప్పారు. కార్యక్ర మంలో టీడీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రాటకొండ మధుబాబు, అన్వర్బాషా, రామచంద్ర పాల్గొన్నారు.