మంత్రి దాడిశెట్టి రాజా వాహనాలు సీజ్
ABN , Publish Date - Mar 22 , 2024 | 03:37 AM
ఎన్నికల నేపథ్యంలో అగనంపూడి టోల్ గేటు వద్ద ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టు వద్ద గురువారం మంత్రి దాడిశెట్టి రాజాకు చెందిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
![మంత్రి దాడిశెట్టి రాజా వాహనాలు సీజ్](https://media.andhrajyothy.com/media/2024/20240313/fdjkb_5c07c45e55.jpg)
కూర్మన్నపాలెం (విశాఖపట్నం), మార్చి 21: ఎన్నికల నేపథ్యంలో అగనంపూడి టోల్ గేటు వద్ద ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టు వద్ద గురువారం మంత్రి దాడిశెట్టి రాజాకు చెందిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కోడ్కు విరుద్ధంగా వాహనాల ముందు, వెనుక సీఎం జగన్ చిత్రంతోపాటు ‘సిద్ధం’ పోస్టర్, దాడిశెట్టి రాజా, ఫ్యాన్ గుర్తుతో కూడిన ఫ్లెక్సీ ఉన్నాయి. దీంతో వాహనాలను ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సీజ్ చేసి దువ్వాడ పోలీస్ స్టేషన్కు తరలించారు.