జాతీయ స్థాయి తైక్వాండోలో పతకాలు
ABN , Publish Date - Jan 09 , 2024 | 12:16 AM
జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ తైక్వాండో అండర్-14, 17, 19 బాల, బాలికల విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన జిల్లా క్రీడాకారులు అత్యంత ప్రతిభ కనబరచి పతకాలు సాధించారని జిల్లా స్కూల్గేమ్స్ కార్యదర్శి శివకుమార్ సోమవారం తెలిపారు.
![జాతీయ స్థాయి తైక్వాండోలో పతకాలు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
నంద్యాల నూనెపల్లె, జనవరి 8 : జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ తైక్వాండో అండర్-14, 17, 19 బాల, బాలికల విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన జిల్లా క్రీడాకారులు అత్యంత ప్రతిభ కనబరచి పతకాలు సాధించారని జిల్లా స్కూల్గేమ్స్ కార్యదర్శి శివకుమార్ సోమవారం తెలిపారు. డిసెంబర్ 31నుంచి జనవరి 5వరకు మధ్యప్రదేశ్లోని బీటల్లో జరిగిన పోటీల్లో జిల్లాకు చెందిన దొర్నిపాడు మండలం భాగ్యనగరం జెడ్పీహెచ్ఎస్ విద్యార్థిని ఆకుల సమీరా కాంస్య పతకం సాధించిందన్నారు. అదే పాఠశాలకు చెందిన రాముడు 5వ స్థానం సాధించినట్లు చెప్పారు. డీఈవో సుధాకర్, డిప్యూటీ ఈవో మహబూబ్బేగ్, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి శివకుమార్ డీఈవో కార్యాలయంలో అభినందించారు.