Share News

సీఏ ఫైనల్‌ ఫలితాల్లో మాస్టర్‌మైండ్స్‌ సత్తా

ABN , Publish Date - Dec 28 , 2024 | 05:02 AM

జాతీయస్థాయిలో ది ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన సీఏ ఫైనల్‌ ఫలితాల్లో మాస్టర్‌మైండ్స్‌ విద్యార్థి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించినట్టు అడ్మిన్‌ అడ్వైజర్‌ మట్టుపల్లి మోహన్‌ వెల్లడించారు.

సీఏ ఫైనల్‌ ఫలితాల్లో మాస్టర్‌మైండ్స్‌ సత్తా

జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు కైవసం

గుంటూరు(విద్య), డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): జాతీయస్థాయిలో ది ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన సీఏ ఫైనల్‌ ఫలితాల్లో మాస్టర్‌మైండ్స్‌ విద్యార్థి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించినట్టు అడ్మిన్‌ అడ్వైజర్‌ మట్టుపల్లి మోహన్‌ వెల్లడించారు. ఈ మేరకు మెయిన్‌ క్యాంప్‌సలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మోహన్‌ మాట్లాడుతూ తమ విద్యార్థి రిషబ్‌ ఓత్సవాల్‌ ఆర్‌ మొదటి ర్యాంకు కైవసం చేసుకున్నాడని తెలిపారు. అదే విధంగా మంజూలూరి మోహన్‌కృష్ణ 33, కేసన సాయిచరణ్‌ 34, కాకుమాను కృష్ణచైతన్య 40వ ర్యాంకు సాధించినట్టు తెలిపారు. ఇప్పటి వరకు తమ విద్యార్థులు 50 సార్లు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించారని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Dec 28 , 2024 | 05:02 AM