Share News

టీడీపీలోకి భారీగా వలసలు

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:20 PM

మండల కేంద్రంలోని 4వ వార్డుకు చెందిన 150 మైనార్టీకి చెందిన వైసీపీ కుటుంబాలు టీడీపీలోకి చేరాయి.

టీడీపీలోకి భారీగా వలసలు
మైనార్టీల సమావేశంలో మాట్లాడుతున్న వీరభద్రగౌడ్

హొళగుందకు చెందిన 150 మైనార్టీ కుటుంబాలు

వందవాగిలిలో 50 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరిక

మైనార్టీలను వైసీపీ మోసం చేసింది : వీరభద్రగౌడ్‌

హొళగుంద, ఏప్రిల్‌ 26: మండల కేంద్రంలోని 4వ వార్డుకు చెందిన 150 మైనార్టీకి చెందిన వైసీపీ కుటుంబాలు టీడీపీలోకి చేరాయి. అలాగే వందవాగిలి గ్రామంలో 50 కుటుంబాలు టీడీపీ అభ్యర్థి వీరభద్రగౌడ్‌, ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు, జనసేన పార్టీ ఇన్‌చార్జి వెంకప్ప సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వీరభద్ర గౌడ్‌ మాట్లాడుతూ మైనార్టీల అభివృద్ధికి టీడీపీ ఎన్నో సంక్షేమ పథకాలను తెచ్చిందని అన్నారు. అలాంటి మైనార్టీలను వైసీపీ పార్టీ మోసం చేసిందని, దుల్హన్‌ పథకం, రంజాన్‌ తోఫా, విదేశీ విద్యలాంటి పథకాలను మైనార్టీలకు దూరం చేసిన ఘనత జగన్మోహన్‌ రెడ్డికే దక్కుతుందన్నారు. ప్రతి ఒక్కరూ టీడీపీకి ఓటు ద్వారా మద్దతు తెలపాలని కోరారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ తిప్పయ్య, టీడీపీ సీనియర్‌ నాయకులు ఈడిగ గోవింద్‌ గౌడ్‌, మిక్కిలినేని ప్రసాద్‌, ఆలూరు మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ జయరాం, బీజేపీ నాయకుడు వెంకటరాముడు, మైనారిటీ నాయకుడు ఎండీ ఆదాం, ఎండీ హళ్లి సుధాకర్‌, మైనారిటీ స్టేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అల్తాఫ్‌ హుసేన్‌, కర్నూలు జిల్లా టీడీపీ మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు సయ్యద్‌ అఫ్సర్‌ బాష, వక్ఫ్‌బోర్డు మెంబర్‌ జాకీర్‌, మాజీ వైస్‌ సర్పంచ్‌ అబ్దుల్‌ సుభాన్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 11:20 PM