వారాహియాత్రను విజయవంతం చేయండి
ABN , Publish Date - Apr 06 , 2024 | 12:27 AM
అచ్యుతాపురంలో ఈనెల 8వ తేదీన జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ చేపట్టబోయే వారాహి యాత్రను విజయవంతం చేయాలని జనసేన ఎలమంచిలి ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయకుమార్, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రగడ నాగేశ్వరరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
![వారాహియాత్రను విజయవంతం చేయండి](https://media.andhrajyothy.com/media/2024/20240326/5rbl3_3d20f252f6.jpg)
రాంబిల్లి, ఏప్రిల్ 5 : అచ్యుతాపురంలో ఈనెల 8వ తేదీన జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ చేపట్టబోయే వారాహి యాత్రను విజయవంతం చేయాలని జనసేన ఎలమంచిలి ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయకుమార్, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రగడ నాగేశ్వరరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం లాలంకోడూరులోని నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. వారాహి యాత్ర తొలుత ఈనెల 6వ తేదీన జరగాల్సి ఉన్నప్పటికీ పవన్కల్యాణ్కు జ్వరం కారణంగా ఈనెల 8వ తేదీకి వాయిదా పడిందన్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గుణపాఠం తప్పదన్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ హాజరు కానున్నారన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ జడ్పీ మాజీ చైర్పర్సన్ లాలం భవాని, సీఎం రాజేష్, జనసేన నాయకులు బైలపూడి శ్రీరామదాసు, పప్పల నూకన్నదొర, జనపరెడ్డి శ్రీనివాసరావు, టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆడారి మంజు తదితరులు పాల్గొన్నారు.