మహాకవి శ్రీశ్రీ కుమారుడు కన్నుమూత
ABN , Publish Date - Jun 08 , 2024 | 03:39 AM
మహాకవి శ్రీశ్రీ కుమారుడు శ్రీ రంగం వెంకటరమణ(59) ఆనారోగ్య కారణాలతో అమెరికాలో చనిపోయారు.
![మహాకవి శ్రీశ్రీ కుమారుడు కన్నుమూత](https://media.andhrajyothy.com/media/2024/20240604/dflkb_f72259ce1b.jpg)
అనారోగ్యంతో అమెరికాలో మృతి
గుంటూరు(తూర్పు), జూన్ 7: మహాకవి శ్రీశ్రీ కుమారుడు శ్రీ రంగం వెంకటరమణ(59) ఆనారోగ్య కారణాలతో అమెరికాలో చనిపోయారు. శుక్రవారం ఈమేరకు ఆయన బంధువు రమణ యశస్వి గుంటూరులో ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీ రంగం వెంకటరమణ కుటుంబం పాతికేళ్ల కిత్రం అమెరికాలో స్థిరపడింది. ఫైజర్ కంపెనీలో వెంకటరమణ పరిశోధన విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడికి శ్రీనివాసరావు(శ్రీశ్రీ) అని, కుమార్తెకు ‘కవిత’ పేరును పెట్టుకున్నారు. వెంకటరమణ కుటుంబానికి అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి జీవీ పూర్ణచంద్, పలువురు సాహితీవేత్తలు సానుభూతి తెలిపారు.