Share News

రామానుజర్‌ సన్నిధిలో లోకేశ్‌

ABN , Publish Date - Feb 28 , 2024 | 03:16 AM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మంగళవారం కాంచీపురం జిల్లా శ్రీపెరంబుదూర్‌లోని శ్రీరామానుజర్‌ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఉదయం 8.40

రామానుజర్‌ సన్నిధిలో లోకేశ్‌

చెన్నై, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మంగళవారం కాంచీపురం జిల్లా శ్రీపెరంబుదూర్‌లోని శ్రీరామానుజర్‌ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఉదయం 8.40 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా చెన్నై చేరుకున్న ఆయనకు, టీడీపీ చెన్నై విభాగ అధ్యక్షుడు చంద్రశేఖర్‌, ప్రముఖ ఆడిటర్‌ నూతలపాటి శ్రీకృష్ణ, పలువురు నగర ప్రముఖులు, టీడీపీ మద్దతుదారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా ఆలయానికి చేరుకున్న లోకేశ్‌కు అక్కడి ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం లోకేశ్‌ సంప్రదాయపూర్వకంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో అన్నానగర్‌ ఎమ్మెల్యే మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 28 , 2024 | 03:16 AM