Share News

జూలై 29 నుంచి సుప్రీంలో లోక్‌ అదాలత్‌

ABN , Publish Date - Jun 11 , 2024 | 02:06 AM

సుప్రీంకోర్టులో జూలై 29 నుంచి ఆగస్టు 3 వరకు ప్రత్యేక లోక్‌అదాలత్‌ నిర్వహించనున్నట్టు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి ఎం.బబిత సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

జూలై 29 నుంచి సుప్రీంలో లోక్‌ అదాలత్‌

అమరావతి, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టులో జూలై 29 నుంచి ఆగస్టు 3 వరకు ప్రత్యేక లోక్‌అదాలత్‌ నిర్వహించనున్నట్టు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి ఎం.బబిత సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. సుప్రీంకోర్టులో రాజీకి అవకాశం ఉన్న అన్ని కేసులను ఈ ప్రత్యేక లోక్‌ అదాలత్‌లో కక్షిదారులు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం కక్షిదారులు తమ సమీప కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవాధికార సంస్థను లేదా టోల్‌ఫ్రీ నంబరు 15100లో సంప్రదించవచ్చని సూచించారు. రాష్ట్రంలోని కక్షిదారులకు సహాయం అందించేందుకు ఉన్నత న్యాయస్థానం, న్యాయసేవాధికార సంస్థ అన్ని చర్యలూ తీసుకుంటుందని తెలిపారు.

Updated Date - Jun 11 , 2024 | 08:11 AM