అయోధ్య ఆలయ ప్రతిష్ఠ వేళ మసీదుల్లోనూ దీపాలు పెట్టండి
ABN , Publish Date - Jan 11 , 2024 | 03:54 AM
దేశంలోని 140 కోట్ల మంది ప్రజల డీఎన్ఏ ఒకటేనని, హిందువులు, ముస్లింలు సోదరులని బీజేపీ జాతీయ మోర్చా అధ్యక్షుడు జమాల్ సిద్ధిఖి పేర్కొన్నారు.
బీజేపీ మైనార్టీ మోర్చా జాతీయ అధ్యక్షుడు జమాల్ సిద్ధిఖి
బెంగళూరు, జనవరి 10(ఆంధ్రజ్యోతి): దేశంలోని 140 కోట్ల మంది ప్రజల డీఎన్ఏ ఒకటేనని, హిందువులు, ముస్లింలు సోదరులని బీజేపీ జాతీయ మోర్చా అధ్యక్షుడు జమాల్ సిద్ధిఖి పేర్కొన్నారు. అయోధ్యలో శ్రీరామచంద్రుడి మూర్తులను ప్రతిష్ఠించే వేళ మసీదులు, దర్గాలలో కనీసం ఐదు దీపాలను ఈ నెల 22న సాయంత్రం వెలిగించాలని ఆయన ముస్లింలకు పిలుపునిచ్చారు. ఇది హిందూ-ముస్లింల మధ్య సామరస్యాన్ని ఎన్నో రెట్లు పెంచుతుందని తెలిపారు. బీజేపీ మైనార్టీ మోర్చా కార్యకర్తలు మసీదులు, దర్గాల కమిటీ పెద్దలను ఇందుకు ఒప్పించే ప్రయత్నం చేస్తారని, అయితే ఎక్కడా బలవంతం ఉండదని అన్నారు.