అవయవ దాత కూతురుకు అండగా నిలుద్దాం
ABN , Publish Date - Feb 20 , 2024 | 11:46 PM
ఇటీవల కర్నూలులో బ్రెయిన్డెడ్కు గురై తన అవయవాలను దానం చేసిన పావనిలత కూతురు చిన్నారి జ్యోత్స్న(6)కు అండగా నిలుద్దామని రెడ్క్రాస్ సొసైటీ సభ్యులు పిలుపునిచ్చారు.
![అవయవ దాత కూతురుకు అండగా నిలుద్దాం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
వెల్దుర్తి, ఫిబ్రవరి 20 : ఇటీవల కర్నూలులో బ్రెయిన్డెడ్కు గురై తన అవయవాలను దానం చేసిన పావనిలత కూతురు చిన్నారి జ్యోత్స్న(6)కు అండగా నిలుద్దామని రెడ్క్రాస్ సొసైటీ సభ్యులు పిలుపునిచ్చారు. ఈ మేరకు వారు విరాళాల సేకరణ చేపట్టారు. వెల్దుర్తి పాతబస్టాండ్ కూడలిలో జిల్లా రెడ్క్రాస్ సోసైటీ ఆధ్వర్యంలో అవయవదానం పై అవగాహన సదస్సు నిర్వహించారు. రెడ్క్రాస్ సభ్యులు రఘునాథరెడ్డి మాట్లాడుతూ బ్రెయిన్డెడ్ కు గురైన పావనిలత అవయవదానం ద్వారా పలువురికి ప్రాణందానం చేసి చిరంజీవిగా చరిత్రలో నిలిచిందన్నారు.