Share News

రాష్ట్రంలో లక్ష కోట్ల లిక్కర్‌ స్కాం

ABN , Publish Date - Apr 24 , 2024 | 03:05 AM

రాష్ట్రంలో వైసీపీ పాలనలో రూ.లక్ష కోట్ల లిక్కర్‌ స్కామ్‌ జరిగిందని బీజేపీ రాష్ట్ర సహ ఇన్‌చార్జి సిద్ధార్థ్‌ నాథ్‌ సింగ్‌ ఆరోపించారు.

రాష్ట్రంలో లక్ష కోట్ల లిక్కర్‌ స్కాం

బీజేపీ రాష్ట్ర సహ ఇన్‌చార్జి సిద్ధార్థ్‌నాథ్‌ సింగ్‌

అమరావతి, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వైసీపీ పాలనలో రూ.లక్ష కోట్ల లిక్కర్‌ స్కామ్‌ జరిగిందని బీజేపీ రాష్ట్ర సహ ఇన్‌చార్జి సిద్ధార్థ్‌ నాథ్‌ సింగ్‌ ఆరోపించారు. మైనింగ్‌, ఇసుక, తదితర వనరులు మొత్తాన్ని దోచేసిన జగన్‌రెడ్డి ప్రతి ఓటరుపై రూ.3.25 లక్షల అప్పు భారం మోపారని అన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్నికల సమన్వయకర్త పేరాల శేఖర్‌, అధికార ప్రతినిధి సాదినేని యామినీ శర్మ తదితరులతో కలసి పార్టీ ఎన్నికల మేనిఫెస్టో తెలుగు కాపీని విడుదల చేశారు. ‘జగన్‌ హయాం లో రాష్ట్రంలో ఏకంగా 3,000 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మో దీ ఇచ్చిన రూ.6,000 సైతం తన ఖాతాలో వేసుకుని అన్నదాతల్ని వంచించా రు. పదేళ్ల నరేంద్ర మోదీ పాలనలో రైతులు, పేదలు, చిరు వ్యాపారులు, గిరిజనులు, దళితులు అన్ని వర్గాలకు మేలు జరిగింది’ అని అన్నారు.

Updated Date - Apr 24 , 2024 | 07:20 AM