Share News

TDP: మీడియాపై దాడుల్ని ఖండిస్తున్నాం.. పత్రిక స్వేచ్ఛకు జగన్ సమాధి కడుతున్నారు: అచ్చెన్నాయుడు

ABN , Publish Date - Feb 20 , 2024 | 09:08 PM

సీఎం జగన్(CM Jagan) పత్రికా స్వేచ్ఛకు సమాధి కట్టారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. మీడియాపై వైసీపీ నేతల వరుస దాడుల నేపథ్యంలో ఆయన అమరావతిలో మాట్లాడారు.

TDP: మీడియాపై దాడుల్ని ఖండిస్తున్నాం.. పత్రిక స్వేచ్ఛకు జగన్ సమాధి కడుతున్నారు: అచ్చెన్నాయుడు

అమరావతి: సీఎం జగన్(CM Jagan) పత్రికా స్వేచ్ఛకు సమాధి కట్టారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. మీడియాపై వైసీపీ నేతల వరుస దాడుల నేపథ్యంలో ఆయన అమరావతిలో మాట్లాడారు.

"కర్నూలులో ఈనాడు కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైసీపీ పాలనలో పత్రిక స్వేచ్ఛకు సమాధి కట్టారు. సీఎం జగన్ రెడ్డి తన పెంపుడు కుక్కలను పిచ్చి కుక్కలుగా మార్చి రోడ్లపైకి వదిలారు. వైసీపీ నేతల అరాచకాలు, అక్రమాలను ఎండకడుతున్న పత్రికా విలేకరులపై, సంస్థలపై దాడులు చేసే నీచ సంస్కృతికి ఆయన తెరలేపారు. ఆంధ్రజ్యోతి ఫొటో జర్నలిస్టు, ఈనాడు లోకల్ ఆఫీసులపై వైసీపీ గుండాలు దాడి చేయడాన్ని ఖండిస్తున్నాం. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు, దాడులు, దౌర్జన్యాలతో వేధింపులకు పాల్పడుతున్నారు. ఈనాడు కార్యాలయంపై దాడి జరుగుతుంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తోంది? పత్రికా కార్యాలయంపై దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. జగన్ రెడ్డి చేస్తున్న అరాచకాలకు అంతకంతకు వడ్డీతో సహా బదులు చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి" అని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 20 , 2024 | 09:08 PM