Share News

‘పది’ ఫలితాల్లో ‘కేశవరెడ్డి’ ప్రభంజనం

ABN , Publish Date - Apr 24 , 2024 | 02:59 AM

రాష్ట్రంలో ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో కేశవరెడ్డి విద్యా సంస్థల విద్యార్థులు మరోసారి టాప్‌ మార్కులతో చరిత్ర సృష్టించారు.

‘పది’ ఫలితాల్లో ‘కేశవరెడ్డి’ ప్రభంజనం

అమరావతి, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో కేశవరెడ్డి విద్యా సంస్థల విద్యార్థులు మరోసారి టాప్‌ మార్కులతో చరిత్ర సృష్టించారు. ఈ విద్యా సంస్థలకు చెందిన యస్‌.సాయి స్వతేజ్‌ 597 మార్కులతో ప్రథమ స్థానంలో నిలవగా, టి.సాయి నిఖిత, వి.యన్‌.రోషిణి, యస్‌.రజియా సుల్తానా, యస్‌.ప్రశాంత్‌, కె.భావన 596 మార్కులు, యస్‌.మహ్మద్‌ జయాన్‌ 595 మార్కులతో వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచారు. 49 మంది విద్యార్థులు టాప్‌ 10లో నిలిచి సరిక్రొత్త రికార్డ్‌ సృష్టించారు. ఒక్క అత్యధిక మార్కులే కాక ప్రతి ఐదుగురు విద్యార్థుల్లో ముగ్గురు 500కు పైగా మార్కులు, ప్రతి సబ్జెక్టులో సగానికి పైగా విద్యార్థులకు 90 శాతానికి పైగా మార్కులు, లాంగ్వేజ్‌ల్లో సగటున 82.6 శాతం, నాన్‌ లాంగ్వేజ్‌లో సగటున 85.3 శాతం మార్కులు సాధించడం కేశవరెడ్డి విద్యా సంస్థల విద్యా ప్రమాణాల నాణ్యతకు అద్దం పడుతోందని విద్యాసంస్థల ఫౌండర్‌ ఛైర్మన్‌ యన్‌. కేశవరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను, అందుకు విశేషంగా కృషిచేసిన ఉపాధ్యాయులను ఆయన అభినందించారు.

Updated Date - Apr 24 , 2024 | 03:00 AM