Share News

రాఘవేంద్రుని సన్నిధిలో కర్నాటక హైకోర్టు జడ్జీ

ABN , Publish Date - Apr 08 , 2024 | 12:02 AM

కర్ణాటక రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్‌ రాజేంద్ర బధామికర్‌ ఆదివారం రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు.

రాఘవేంద్రుని సన్నిధిలో  కర్నాటక హైకోర్టు జడ్జీ

మంత్రాలయం, ఏప్రిల్‌ 7 : కర్ణాటక రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్‌ రాజేంద్ర బధామికర్‌ ఆదివారం రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. శనివారం రాత్రి మంత్రాలయంలో బస చేశారు. ఈయనకు మహాముఖ ద్వారం వద్ద మఠం ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌ కే శ్రీనివాసరావు, వెంటేష్‌ జోషి, శ్రీపతి ఆచార్‌, ఐపీ నరసింహామూర్తి ఘనంగా స్వాగతం పలికారు. గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి విశేష పూజలు చేశారు. అనంతరం మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు జ్ఞాపిక, శేషవస్త్రం, ఫల, పుష్ప, మంత్రాక్షితలు, పరిమళ ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు. వీరి వెంట ఏఎస్‌ఐ ఆనందరెడ్డి, బిందు మాధవ్‌, అనంతస్వామి, ప్రకాశ్‌ ఆచార్‌, భీమ్‌సేన్‌ ఆచార్‌, పవన్‌ఆచార్‌, వ్యాసరాజార్‌, జయతీర్థ ఆచార్‌, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2024 | 12:02 AM