Share News

శ్రీవారి పున్నమి గరుడసేవలో జస్టిస్‌ ఎన్వీ రమణ

ABN , Publish Date - Mar 26 , 2024 | 03:23 AM

తిరుమలలో సోమవారం రాత్రి శ్రీవారికి పున్నమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య ఆలయ నాలుగు మాడవీధుల్లో గరుడసేవను నిర్వహించారు.

శ్రీవారి పున్నమి గరుడసేవలో జస్టిస్‌ ఎన్వీ రమణ

తిరుమల, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో సోమవారం రాత్రి శ్రీవారికి పున్నమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య ఆలయ నాలుగు మాడవీధుల్లో గరుడసేవను నిర్వహించారు. సర్వాలంకార భూషితుడైన మలయప్పస్వామి తన ఇష్టవాహనమైన గరుడుడిపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ కుటుంబ సమేతంగా గరుడసేవలో పాల్గొన్నారు. నైవేద్య విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు.

Updated Date - Mar 26 , 2024 | 03:24 AM