చిన వెంకన్న సేవలో జస్టిస్ గోపాలకృష్ణారావు
ABN , Publish Date - Mar 01 , 2024 | 03:35 AM
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి క్షేత్రాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాలకృష్ణారావు గురువారం ఉదయం సందర్శించారు. స్వామి,
ద్వారకాతిరుమల, ఫిబ్రవరి 29: ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి క్షేత్రాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాలకృష్ణారావు గురువారం ఉదయం సందర్శించారు. స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ముఖమండపంలో అర్చకులు ఆయనకు శ్రీవారి శేషవస్త్రాన్ని కప్పివేద ఆశీర్వచనాన్ని అందజేశారు. న్యాయమూర్తి దంపతులకు ఆలయ సూపరింటెండెంట్ రమణరాజు స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు.