ఏపీఐఐసీ చైర్మన్గా జంకె వెంకటరెడ్డి
ABN , Publish Date - Feb 13 , 2024 | 02:14 AM
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) చైర్మన్గా ప్రకాశం జిల్లా మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి నియమితులయ్యారు.
![ఏపీఐఐసీ చైర్మన్గా జంకె వెంకటరెడ్డి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
అమరావతి, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) చైర్మన్గా ప్రకాశం జిల్లా మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెంకటరెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటివరకు ఏపీఐఐసీ చైర్మన్గా ఉన్న మెట్టు గోవిందరెడ్డి రానున్న ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేయనున్న నేపథ్యంలో ఈ నియామకం జరిగినట్టు ఏపీఐఐసీ వర్గాలు భావిస్తున్నాయి.