Share News

జగన్‌ ఓటమే ధ్యేయం కావాలి

ABN , Publish Date - Feb 28 , 2024 | 03:25 AM

రానున్న ఎన్నికల్లో సీఎం జగన్‌ ఓటమే ప్రతి ఒక్కరి ధ్యేయం కావాలని ఏపీ పంచాయతీరాజ్‌ చాంబర్‌ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ పిలుపునిచ్చారు.

జగన్‌ ఓటమే ధ్యేయం కావాలి

వైవీబీ

డాబాగార్డెన్స్‌ (విశాఖపట్నం), ఫిబ్రవరి 27: రానున్న ఎన్నికల్లో సీఎం జగన్‌ ఓటమే ప్రతి ఒక్కరి ధ్యేయం కావాలని ఏపీ పంచాయతీరాజ్‌ చాంబర్‌ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ పిలుపునిచ్చారు. మంగళవారం వీజేఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పంచాయతీలకు కేంద్రం విడుదల చేసిన రూ.6,848 కోట్ల నిధులను దారి మళ్లించిన జగన్‌.. గ్రామాల అభివృద్ధిని కాలరాశాడని మండిపడ్డారు. పంచాయతీలకు సంబంధించిన 16 డిమాండ్ల నెరవేర్చేంత వరకూ నిరసనలు కొనసాగిస్తామన్నారు. అన్ని రాజకీయ పార్టీల సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ద్వారా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అధికార వైసీపీ ఓటమి కోసం కృషిచేయాలని పిలుపునిచ్చామన్నారు. సర్పంచులా.. వలంటీర్లా.. ఎవరు కావాలో జగన్‌ తేల్చుకోవాలన్నారు. సమావేశంలో రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Feb 28 , 2024 | 08:21 AM