Share News

నేటితో ముగియనున్న జగన్‌ యాత్ర

ABN , Publish Date - Apr 24 , 2024 | 03:11 AM

సీఎం జగన్‌ బస్సు యాత్ర శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో బుధవారం ముగియనుంది.

నేటితో ముగియనున్న జగన్‌ యాత్ర

అమరావతి, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): సీఎం జగన్‌ బస్సు యాత్ర శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో బుధవారం ముగియనుంది. గత నెల 27న కడప జిల్లా ప్రొద్దుటూరులో మొదలైన బస్సు యాత్ర మంగళవారం 21వ రోజుకు చేరుకుంది. సాయంత్రం వరకు విజయనగరం జిల్లాలో పర్యటన సాగించి, రాత్రికి శ్రీకాకుళం జిల్లాలోకి ఆయన ప్రవేశించారు. ఎచ్చెర్ల నియోజకవర్గం అక్కివలసలో బస చేశారు. టెక్కలిలోని అక్కవరం ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం 2గంటలకు నిర్వహించే ‘మేమంతా సిద్ధం’ ముగింపు సభలో జగన్‌ పాల్గొంటారు. అధికార పార్టీ నాయకులు వాహనాల పార్కింగ్‌ కోసం సమీపంలోని పొలాల గట్లను యంత్రాలతో తొలగించారు. దీనిపై శ్యామసుందరాపురం తదితర గ్రామాల రైతులు నిరసన తెలిపారు. కాగా, 25న పులివెందులలో జగన్‌ నామినేషన్‌ వేస్తారు. 26 లేక 27వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా బహిరంగ సభలు నిర్వహించాలని జగన్‌ భావిస్తున్నారు.

Updated Date - Apr 24 , 2024 | 06:56 AM