Share News

ఎన్నికలకు ముందే జగన్‌ అస్త్రసన్యాసం!: లోకేశ్‌

ABN , Publish Date - Apr 28 , 2024 | 03:16 AM

వైసీపీ అధినేత జగన్‌ ప్రకటించిన మేనిపెస్టోను చూస్తుంటే.. అది మేనిపెస్టో కన్నా, ఆయన రాజీనామా లేఖలా అనిపిస్తోందని టీడీపీ నేత నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు.

ఎన్నికలకు ముందే జగన్‌ అస్త్రసన్యాసం!: లోకేశ్‌

మంగళగిరి, ఏప్రిల్‌ 27: వైసీపీ అధినేత జగన్‌ ప్రకటించిన మేనిపెస్టోను చూస్తుంటే.. అది మేనిపెస్టో కన్నా, ఆయన రాజీనామా లేఖలా అనిపిస్తోందని టీడీపీ నేత నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని పెదవడ్లపూడి గ్రామంలో శనివారం నిర్వహించిన రచ్చబండలో ఆయన ప్రసంగించారు. తమ నాయకుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే సామాజిక పెన్షన్లను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామని ముందే ప్రకటించారన్నారు. ఇప్పుడేమో జగనొచ్చి వచ్చే ఐదేళ్లలో రూ.500 పెంచగలనంటూ వైసీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన తీరు చూస్తుంటే ఆయన దివాలాకోరుతనం తెలిసిపోతోందని ఎద్దేవా చేశారు. గతంలో రూ.200 పెన్షన్‌ను రూ.2000కు పెంచింది చంద్రబాబేనన్న సంగతి మరువరాదన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 08:15 AM