Share News

రేపు విశాఖ పర్యటనకు జగన్‌

ABN , Publish Date - Feb 20 , 2024 | 05:30 AM

ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి బుధవారం విశాఖపట్నం పర్యటనకు వెళ్తున్నారు. శ్రీ శారదా పీఠంలో రాజశ్యామల అమ్మవారిని

రేపు విశాఖ పర్యటనకు జగన్‌

శారదాపీఠంలో రాజశ్యామల దర్శనం

అమరావతి/విశాఖపట్నం ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి బుధవారం విశాఖపట్నం పర్యటనకు వెళ్తున్నారు. శ్రీ శారదా పీఠంలో రాజశ్యామల అమ్మవారిని దర్శించుకోనున్నారు. బుధవారం ఉదయం తాడేపల్లి నుంచి ఆయన విశాఖపట్నం చేరుకుంటారు. విశాఖ విమానాశ్రయం నుంచి నేరుగా చినముషిడివాడలో గల శారదా పీఠానికి వెళ్లి పీఠం వార్షికోత్సవంలో పాల్గొంటారు. రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తిరిగి విజయవాడ బయలుదేరతారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు ఇటీవల ఉండవల్లిలోని తమ నివాసంలో రాజశ్యామల యాగం చేసిన సంగతి తెలిసిందే. మూడురోజుల తర్వాత జగన్‌ రాజశ్యామల అమ్మవారి దర్శనానికి విశాఖ వెళ్తున్నారు.

Updated Date - Feb 20 , 2024 | 08:29 AM