మాదిగలను దగా చేసిన జగన్
ABN , Publish Date - Apr 19 , 2024 | 12:33 AM
మాదిగలను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దగా చేశారని ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు ముత్యాల గాదిలింగ అన్నారు.
వీరభద్ర గౌడ్కు ఎమ్మార్పీఎస్ మద్దతు
ఆలూరు, ఏప్రిల్ 17: మాదిగలను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దగా చేశారని ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు ముత్యాల గాదిలింగ అన్నారు. గురువారం స్థానిక టీడీపీ కార్యాలయంలో టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడ్ను కలిసి మద్దతు ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం ఎస్సీల సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. ముఖ్యంగా ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించి ఎస్సీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేశారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ఆలూరు టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడ్ గెలుపు కోసం ఎమ్మార్పీఎస్ పనిచేస్తుందని హామీ ఇచ్చారు. ఆయన వెంట హాలహర్వి మండల ఎమ్మార్పీఎస్ నాయకులు ఉచ్చిరంగ, గంగాధర్, హోలగుంద పకీరప్ప, శేషగిరి, చిప్పగిరి శివరాజ్ కుమార్, శివ, రామాంజనేయులు, పెద్ద సంజప్ప, బాలరాజు, మల్లి, బిలేహళ్ మల్లయ్య పాల్గొన్నారు.