జగన్ భూకబ్జా కోరు: వెంకట్
ABN , Publish Date - Jan 28 , 2024 | 03:08 AM
ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం భూ బకాసురుడిలాగా మారింది. సీఎం జగన్ భూకబ్జాకోరుగా మారారు’ అని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బీ వెంకట్ ఆరోపించారు.
![జగన్ భూకబ్జా కోరు: వెంకట్](https://media.andhrajyothy.com/media/2023/20231205/BB_14c1a7956b.jpg)
న్యూఢిల్లీ, జనవరి 27(ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం భూ బకాసురుడిలాగా మారింది. సీఎం జగన్ భూకబ్జాకోరుగా మారారు’ అని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బీ వెంకట్ ఆరోపించారు. శనివారం ఏపీ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఏపీలో జగన్, దళితుల హక్కులను కాలరాస్తున్నారు. సామాజిక న్యాయం పేరిట దళితులకు, గిరిజనులకున్న భూములు లాగేసుకుంటున్నారు. అసైన్డ్ భూమిపై జారీ చేసిన జీవోను వెనక్కి తీసుకోవాలి’ అని వెంకట్ డిమాండ్ చేశారు.