జగన్.. డీజీపీని స్వతంత్రంగా పనిచేయనివ్వండి
ABN , Publish Date - Feb 02 , 2024 | 03:12 AM
పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డికి రక్షణ కల్పించండి. డీజీపీకి స్వతంత్రంగా పనిచేసుకునే అధికారం ఇవ్వండి’ అని సీఎం వైఎస్ జగన్కు ఏపీసీసీ ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ విజ్ఞప్తి చేశా రు.
![జగన్.. డీజీపీని స్వతంత్రంగా పనిచేయనివ్వండి](https://media.andhrajyothy.com/media/2023/20231205/ff_c7853f0408.jpg)
షర్మిలకు రక్షణ కల్పించండి: మాణిక్కం ఠాగూర్
అమరావతి, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): ‘పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డికి రక్షణ కల్పించండి. డీజీపీకి స్వతంత్రంగా పనిచేసుకునే అధికారం ఇవ్వండి’ అని సీఎం వైఎస్ జగన్కు ఏపీసీసీ ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ విజ్ఞప్తి చేశా రు. షర్మిల భద్రతపై పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఎక్స్ వేదికగా ఆందోళన వెలిబుచ్చారు. షర్మిలకు భద్రత తగ్గించారని, వెంటనే ఆమె కోరిన విధంగా 4+4 సెక్యూరిటీ, ఎస్కార్ట్ వాహన సౌకర్యం కల్పించాలని ఆయన ఎక్స్ వేదికగా డీజీపీకి విజ్ఞప్తి చేశారు.