Share News

మైనార్టీలకు జగన్‌ చేసింది శూన్యం

ABN , Publish Date - Mar 14 , 2024 | 12:32 AM

రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు సీఎం జగన్‌ చేసిందేమీలేదని మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి అన్నారు.

 మైనార్టీలకు జగన్‌ చేసింది శూన్యం
ఎమ్మిగనూరులో బీవీ జయనాగేశ్వరరెడ్డి ప్రచారం

ఎమ్మిగనూరులో బీవీ జయనాగేశ్వరరెడ్డి ఇంటింటి ప్రచారం

ఎమ్మిగనూరు/గోనెగండ్ల,మార్చి13: రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు సీఎం జగన్‌ చేసిందేమీలేదని మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని 17వార్డు మైనార్టీ కాలనీలో బూబు ష్యూరిటి భవిష్యత్తుకు గ్యారంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే గోనెగండ్లలో కార్యకర్తలతో కలిసి బీవీ పర్యటించారు. ఎమ్మిగనూరులో ఆయన ఇంటింటికీ తిరుగుతూ సమస్యలు తెలుసుకున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు సూపర్‌ సిక్స్‌ పథకాల ద్వారా చేకూరే ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, భూకబ్జాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించారని గుర్తుచేశారు. ఈ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు చేసిందేమీ లేదన్నారు. టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన రంజాన్‌ తోఫా, పెళ్లికానుక వంటివి రద్దుచేసి ముస్లింలను మోసం చేశారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఆదరించాలని కోరారు. అలాగే గోనెగండ్లలో టీడీపీ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బీవీ జయనాగేశ్వరరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో గోనెగండ్ల మండల టీడీపీ కన్వీనర్‌ నజీర్‌సాహెబ్‌, తిరుపతయ్యనాయుడు, రమేష్‌నాయుడు, బేతాలబడేసా, భారతం రహంతుల్లా, ఎమ్మిగనూరు వార్డు ఇన్‌చార్జి బోయ జయన్న, మాజీ కౌన్సిలర్‌ లక్ష్మి, నాయకులు కొండయ్యచౌదరి, రామదాసు గౌడ్‌, దయాసాగర్‌, రామకృష్ణ నాయుడు, రంగస్వామి గౌడ్‌, మిఠాయి నరసింహులు, సుందరరాజు, కృష్ణతేజ నాయుడు, శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - Mar 14 , 2024 | 12:32 AM