వైసీపీలో అక్రమార్కులు: అశోక్ గజపతిరాజు
ABN , Publish Date - Feb 20 , 2024 | 05:20 AM
అక్రమార్కులు, దొంగ వ్యాపారు లే వైసీపీలో ఉంటారని, అభివృద్ధి కోరుకునే వారే టీడీపీతో ఉంటారని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు.
విజయనగరం, పిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): అక్రమార్కులు, దొంగ వ్యాపారు లే వైసీపీలో ఉంటారని, అభివృద్ధి కోరుకునే వారే టీడీపీతో ఉంటారని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. విజయనగరంలో సోమవారం పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. వీరికి అశోక్తో పాటు మాజీ మంత్రి కళా వెంకటరావు టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా అశోక్, కళాలు మాట్లాడుతూ... ‘వైసీపీ పాలన లో మహిళలకు, ప్రజలకు భద్రత లేకుండా పోయింది. బెదిరింపులు, దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి. ఎంతోమంది ఉత్తరాంధ్ర యువత ఉద్యోగాల్లేక వలసలు పోతున్నారు. అందుకే వైసీపీవారు టీడీపీలోచేరుతున్నారు’ అని అన్నారు.