Share News

పల్నాడు డీపీవో విజయభాస్కర్‌రెడ్డిపై విచారణ

ABN , Publish Date - May 30 , 2024 | 02:10 AM

పల్నాడు జిల్లా పంచాయతీ అధికారి విజయభాస్కర్‌రెడ్డిపై విచారణకు ఎన్నికల సంఘం ఆదేశించింది.

పల్నాడు డీపీవో విజయభాస్కర్‌రెడ్డిపై విచారణ

నరసరావుపేట, మే 29: పల్నాడు జిల్లా పంచాయతీ అధికారి విజయభాస్కర్‌రెడ్డిపై విచారణకు ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు మెమో జారీ చేసింది. ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా మాచర్ల నియోజకవర్గానికి వెబ్‌ కాస్టింగ్‌ పర్యవేక్షణ అధికారిగా విజయభాస్కర్‌రెడ్డి ఉన్నారు. పాల్వాయి గేట్‌ పోలింగ్‌బూత్‌లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంని ధ్వంసం చేసిన విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పకుండా గోప్యంగా ఉంచాడన్న ఆరోపణలున్నాయి. టీడీపీ నేత మన్నవ సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీపీవోపై ఎన్నికల సంఘం విచారణకు అదేశించింది. ఆ మేరకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లత్కర్‌ విచారణ చేపట్టారు. ఆయన ఇచ్చే నివేదిక ఆధారంగా ఈసీ, డీపీవోపై చర్యలు తీసుకోనున్నది.

Updated Date - May 30 , 2024 | 07:38 AM