Share News

ఎమ్మెల్యే బెదిరింపులపై విచారణ జరపండి

ABN , Publish Date - Mar 09 , 2024 | 12:14 AM

ప్రొద్దుటూరుఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి వైసీపీకి చెందిన 3 వవార్డు కౌన్సిలర్‌ జంబాపురం వెంకటలక్ష్మి ఆమె భర్త మాజీ కౌన్సిలర్‌ జంబాపురం రామాంజనేయ రెడ్డిలను బెదిరించిన ఘనటపై భారత ఎన్నికల కమిషన్‌ స్పందించింది.

ఎమ్మెల్యే బెదిరింపులపై విచారణ జరపండి

ఆదేశించిన ప్రధాన ఎన్నికల కమిషన్‌

విచారణకు ఆర్‌వో ఉత్తర్వులు

ప్రొద్దుటూరు, మార్చి 8: ప్రొద్దుటూరుఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి వైసీపీకి చెందిన 3 వవార్డు కౌన్సిలర్‌ జంబాపురం వెంకటలక్ష్మి ఆమె భర్త మాజీ కౌన్సిలర్‌ జంబాపురం రామాంజనేయ రెడ్డిలను బెదిరించిన ఘనటపై భారత ఎన్నికల కమిషన్‌ స్పందించింది. విచారించి చర్యలు తీసు కోవాలని ఆదేశించింది. ఆ మేరకు కలెక్టర్‌తో పాటు ప్రొద్దుటూరు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి ఢిల్లీలోని ప్రధాన ఎన్నికల కమిషన్‌ నుంచి ఉత్తర్వులు అందాయి. అందులో భాగంగా కౌన్సిలర్‌ ఇచ్చిన ఫిర్యాదుపై విచారించి ఆమెకు ఎమ్మెల్యే నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ప్రొద్దుటూరు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కౌసర్‌ భాను ఎస్పీకి లేఖ రాశారు. ఆ మేరకు కౌన్సిలర్‌ వెంకటలక్ష్మి ప్రధాన ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన కాపీని సైతం జతపరిచినట్లు అందులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోప్రొద్దుటూరు పోలీసు అధికారులు కౌన్సిలర్‌ వెంకటలక్ష్మి, ఆమె భర్త జంబాపురం రామాంజ నేయరెడ్డిలను ఎమ్మెల్యే బెదిరించిన సంఘటనపై విచారణ జరుపుతారా బాధి తులకు న్యాయం జరుగుతుందా లేదా అనేది వేచిచూడాల్సిందే.

Updated Date - Mar 09 , 2024 | 12:14 AM