Viveka Case: వైఎస్ వివేకా హత్య కేసుపై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు
ABN , Publish Date - Apr 18 , 2024 | 07:31 PM
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలో కడప కోర్టు కీలకమైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వివేకా కేసుపై ఎవరూ మాట్లాడొద్దని న్యాయస్థానం పేర్కొంది. ఈ మేరకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వికేక కుమార్తె సునీత, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో (YS Viveka Murder Case) కడప కోర్టు కీలకమైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వివేకా కేసుపై ఎవరూ మాట్లాడొద్దని న్యాయస్థానం పేర్కొంది. ఈ మేరకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వికేక కుమార్తె సునీత, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 'సీఎం జగన్, నారా లోకేశ్, పురందేశ్వరిని కూడా వివేకా హత్యను ఎక్కడా ప్రస్తావించొద్దన్న కోర్టు పేర్కొంది.
వైఎస్ వివేకా హత్య ప్రస్తావించడాన్ని సవాలు చేస్తూ వైసీపీ నేత సురేష్బాబు కడప కోర్టును ఆశ్రయించారు. ప్రతివాదులుగా వైఎస్ షర్మిల, సునీత, చంద్రబాబు, లోకేశ్, పురందేశ్వరి, పవన్, రవీంద్రనాథ్రెడ్డి పేర్లను చేర్చారు. పిటిషనర్ తరపున న్యాయవాది నాగిరెడ్డి వాదనలు వినిపించారు.
ఇది కూడా చదవండి
జగన్పై రాయిదాడి కేసు రిమాండ్ రిపోర్ట్ వచ్చేసింది.. పోలీసులు ఏం తేల్చారంటే?
నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరిలో వైసీపీ పరిస్థితి ఏంటో తెలుసా?
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి