నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
ABN , Publish Date - Mar 01 , 2024 | 03:17 AM
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఈనెల 20 వరకు జరుగుతాయి. మొత్తం 10,52,221 మంది విద్యార్థులు పరీక్షలు
![నేటి నుంచి ఇంటర్ పరీక్షలు](https://media.andhrajyothy.com/media/2024/20240229/cc_0a2a30a9cf.jpg)
10.52లక్షల మంది విద్యార్థులు
అమరావతి, ఫిబ్రవరి 29(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఈనెల 20 వరకు జరుగుతాయి. మొత్తం 10,52,221 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అందులో మొదటి సంవత్సరం 5,17,617 మంది, రెండో సంవత్సరం 5,34,604 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, ఇందుకోసం 1559 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని ఇంటర్ విద్యామండలి గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో 105 కేంద్రాలు అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో, 57 కేంద్రాలు సున్నితమైన ప్రాంతాల్లో ఉన్నట్లు వివరించింది. పరీక్షలపై సందేహాలకు 08645-277707, 18004251531 నంబర్లతో తాడేపల్లిలోని కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.