పోలింగ్ కేంద్రాల పరిశీలన
ABN , Publish Date - Feb 07 , 2024 | 11:20 PM
జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు బుధవారం రాయచోటి అర్బన్ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు పరిశీలించారు.
![పోలింగ్ కేంద్రాల పరిశీలన](https://media.andhrajyothy.com/media/2023/20231205/17rct7_jpeg_f119bdd6b9.gif)
రాయచోటిటౌన్, ఫిబ్రవరి 7: జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు బుధవారం రాయచోటి అర్బన్ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపాలిటీలోని డైట్ పాఠశాల, బాలికల జడ్పీ ఉన్నత పాఠశాల, కొత్తపేట రామాపురం హైస్కూల్లో గల సుమారు 20 పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించాలని మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులకు, ఇంజనీరింగ్ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల విధుల్లో ఏ మాత్రం అలసత్వం వహించినా ఎన్నికల నిబంధనల మేరకు చర్యలు తప్పవని బీఎల్వోలను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ కృష్ణారెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మల్లికార్జున తదితర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.