వారైతే అలా.. వీరైతే ఇలా!
ABN , Publish Date - May 03 , 2024 | 04:25 AM
ప్రతిపక్షాలకు చెందిన మహిళా నేతలు, కుటుంబ సభ్యులపై విరుచుకుపడటం! వైసీపీ వాళ్ల జోలికొస్తే మాత్రం సీఐడీతో అరెస్టులు చేయించడం.. ఐదేళ్లుగా ఇదే వరస! చివరికి ఎన్నికల సమయంలోనూ అదే నీచం.
![వారైతే అలా.. వీరైతే ఇలా!](https://media.andhrajyothy.com/media/2024/20240428/Untitled_18_copy_83b2148a1e.jpg)
నీలి, కూలి మీడియా కోతలు
ప్రతిపక్షాలకు చెందిన మహిళా నేతలు, కుటుంబ సభ్యులపై విరుచుకుపడటం! వైసీపీ వాళ్ల జోలికొస్తే మాత్రం సీఐడీతో అరెస్టులు చేయించడం.. ఐదేళ్లుగా ఇదే వరస! చివరికి ఎన్నికల సమయంలోనూ అదే నీచం.
చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పర్యటనలు, లోకేశ్ భార్య నారా బ్రాహ్మణి ఎన్నికల ప్రచారంపై రోత మీడియా, కూలి మీడియా రకరకాలుగా నోరుపారేసుకుంటోంది. కుప్పంలో చంద్రబాబుకు కష్టంగా ఉన్నందునే ఆయన సతీమణి రంగంలోకి దిగారంటూ వక్రభాష్యం చెబుతోంది.
చివరికి... నారా బ్రాహ్మణి వస్త్రధారణపైనా అవాకులూ, చెవాకులే! కొందరు వైసీపీ నేతలదీ అదే తీరు. ఇప్పుడేమో... జగన్ సతీమణి భారతీ రెడ్డి పులివెందులలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కడప ఎంపీ అభ్యర్థి అవినాశ్ రెడ్డి తరఫున ఆయన భార్య సమత కూడా జనంలో తిరుగుతున్నారు. అంటే... జగన్, అవినాశ్ పనైపోయినందుకే వీళ్లు రంగంలోకి దిగారనుకోవాలా!? అదేం కాదని, వారు ప్రజల కోసం కష్టపడుతున్నారని ఇదే కూలి, నీలి మీడియా కోతలు కోస్తోంది. భారతిని వీర వనితగా అభివర్ణించడం గమనార్హం!
- అమరావతి, ఆంధ్రజ్యోతి