రాజ్యాంగం మారిస్తే పుట్టగతులుండవ్
ABN , Publish Date - Apr 18 , 2024 | 12:53 AM
అంబేడ్కర్ రచించిన దేశ రాజ్యంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తే రాజకీయ పుట్టగతులు ఉండవని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు దేవ సహాయం, ఏఐసీసీ రాష్ట్ర కార్యదర్శి మల్లెల ఆల్ర్ఫెడ్ రాజు అన్నారు.
పెద్దకడుబూరు, ఏప్రిల్ 17: అంబేడ్కర్ రచించిన దేశ రాజ్యంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తే రాజకీయ పుట్టగతులు ఉండవని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు దేవ సహాయం, ఏఐసీసీ రాష్ట్ర కార్యదర్శి మల్లెల ఆల్ర్ఫెడ్ రాజు అన్నారు. బుధవారం మండల పరిధిలోనే కంబదహల్ గ్రామంలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆనంద్ చైతన్య, అంబేడ్కర్ భవన సాధన కమిటీ చైర్మన్ కదిరికోట ఆదెన్నతో కలిసి వారు మాట్లాడారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తామంటున్న ప్రధాని మోదీ రాజ్యాంగాన్ని మారుస్తామని అనుచితంగా వ్యాఖ్యానించిన వ్యక్తిని దేశ ద్రోహం కింద ఎందుకు చర్యలు తీసుకోలేదో ఈ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం ఈ సభకు గ్రామ దళిత నాయకుడు ఎం ఆనంద రాజు అధ్యక్షత వహించారు. రిటైర్డ్ ప్రిన్సిపాల్ లూర్ధయ్య అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.