Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

జగన్‌ సాక్ష్యం చెప్పకపోతే కేసుపెడతాం

ABN , Publish Date - Mar 03 , 2024 | 02:58 AM

కోడికత్తి శ్రీను కేసులో సీఎం జగన్‌ హైకోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకపోతే ఆయనపై 228 ఐపీసీ కింద కేసు పెడతామని శ్రీను తరఫు న్యాయవాది అబుసలీమ్‌ హెచ్చరించారు.

జగన్‌ సాక్ష్యం చెప్పకపోతే కేసుపెడతాం

కోడికత్తి శ్రీను న్యాయవాది అబుసలీమ్‌

రాజమహేంద్రవరం సిటీ, మార్చి 2: కోడికత్తి శ్రీను కేసులో సీఎం జగన్‌ హైకోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకపోతే ఆయనపై 228 ఐపీసీ కింద కేసు పెడతామని శ్రీను తరఫు న్యాయవాది అబుసలీమ్‌ హెచ్చరించారు. మాజీ ఎంపీ జీవీహర్షకుమార్‌ను శనివారం శ్రీను, ఆయన న్యాయవాది అబుసలీమ్‌, శ్రీను అన్న సుబ్బారావు కలిశారు. ఈ సందర్భంగా సలీమ్‌ మీడియాతో మాట్లాడుతూ శ్రీనును అన్యాయంగా జైలులో పెట్టారన్నారు. 9 సార్లు బెయిల్‌ పిటిషన్‌ వేస్తే పదోసారి బెయిల్‌ మంజూరు చేశారన్నారు. ఇప్పటికైనా ఈ కేసులో సాక్ష్యం చెప్పడానికి సీఎం జగన్‌ కోర్టుకు రావాలన్నారు. మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ మాట్లాడుతూ దళిత యువకుడిని జగన్‌ అన్యాయంగా జైలుపాలు చేశాడని అన్నారు. 2019 ఎన్నికల్లో కోడి కత్తి శ్రీను ఘటన, బాబాయి హత్య ఘటనలను సింపతీగా చూపించుకుని జగన్‌ అధికారంలోకి వచ్చాడన్నారు. శుక్రవారం వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె పెట్టిన ప్రెస్‌మీట్‌తో జగన్‌ నిజస్వరూపం బయట పడిందన్నారు.

Updated Date - Mar 03 , 2024 | 08:13 AM