Share News

సెప్టిక్‌ అవుతుందన్నా ప్లాస్టర్‌ తీయరేం?: వర్ల

ABN , Publish Date - Apr 27 , 2024 | 04:11 AM

గులకరాయి తగిలి 13 రోజులైనా ప్లాస్టర్‌ తీయకుండా, జగన్‌ ప్రజల్ని మభ్యపెట్టి, ఓట్లు దండుకోవటానికి డ్రామాలు ఆడుతున్నాడని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు.

సెప్టిక్‌ అవుతుందన్నా ప్లాస్టర్‌ తీయరేం?: వర్ల

అమరావతి, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): గులకరాయి తగిలి 13 రోజులైనా ప్లాస్టర్‌ తీయకుండా, జగన్‌ ప్రజల్ని మభ్యపెట్టి, ఓట్లు దండుకోవటానికి డ్రామాలు ఆడుతున్నాడని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. శుక్రవారం టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మహిళలకు పెద్దాపరేషన్‌ చేసినా.. వారానికే కుట్లు ఊడతీస్తారు. కానీ జగన్‌ మాత్రం మూడు రోజులకు తీయాల్సిన ప్లాస్టర్‌ ఇన్ని రోజులు ఉంచుకుని, సానుభూతి కోసం తాపత్రయపడుతున్నాడు. ఇన్ని రోజులు ప్లాస్టర్‌ ఉంచుకుంటే సెప్టిక్‌ అవుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నా.. తనకు ఓట్లే ముఖ్యమన్నట్లు జగన్‌ వ్యవహరిస్తున్నాడు. బాబాయ్‌ వివేకాపై గొడ్డలి వేటులో సూత్రధారిని అమాయకుడని సీఎం అనడం విడ్డూరం. 11 చార్జిషీట్లున్న తనూ అమాయకుడిననే అంటాడా?’ అని వర్ల ప్రశ్నించారు.

Updated Date - Apr 27 , 2024 | 08:03 AM