58 నెలల్లో ప్రతి ఇంటికీ మేలు చేశాను
ABN , Publish Date - Apr 07 , 2024 | 03:10 AM
58 నెలల పాలనలో ఇంటింటికీ మంచి చేశామని, లంచాలు లేని, వివక్ష లేని పాలన అందించామంటూ సీఎం జగన్ మరోసారి అబద్ధాల దండకం వినిపించారు.
![58 నెలల్లో ప్రతి ఇంటికీ మేలు చేశాను](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
అవినీతి, వివక్ష లేని పాలన అందించాను
కావలి సభలో అవే అబద్ధాలు చెప్పిన జగన్
58 నెలల పాలనలో ఇంటింటికీ మంచి చేశామని, లంచాలు లేని, వివక్ష లేని పాలన అందించామంటూ సీఎం జగన్ మరోసారి అబద్ధాల దండకం వినిపించారు. నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన ‘మేమంతా సిద్ధం’ సభలో ఆయన పాల్గొన్నారు. ‘‘ప్రతి గ్రామంలో సచివాలయం, బడి, ఆసుపత్రి ఒకే చోట అందుబాటులో ఉండేలా చేశాం. ఎవరి వల్ల మేలు జరుగుతుందో లోతుగా ఆలోచించి ఓటు వేయండి’’ అంటూ వేడుకున్నారు. ఇవి ఎమ్మెల్యేలు, ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావని, మూడు ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన ఎన్నికలన్నారు. 14ఏళ్లు సీఎంగా పనిచేశానని చెప్పుకొనే చంద్రబాబు ప్రజల గుండెల్లో నిలిచిపోయే పని ఒక్కటైనా చేశారా అని ప్రశ్నించి.. లేదు అని జనంతో అనిపించాలని ప్రయత్నించారు.