Share News

భారీ సక్సెస్‌

ABN , Publish Date - Apr 17 , 2024 | 01:19 AM

స్వర్ణాంధ్ర సాకార యాత్రకు ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గ ప్రజలు, అభిమానులు భారీగా తరలివచ్చారు.

భారీ సక్సెస్‌
ఎమ్మిగనూరు రోడ్‌షోలో మాట్లాడుతున్న బాలయ్య చిత్రంలో తిక్కారెడ్డి, నాగరాజు, జయనాగేశ్వరరెడ్డి, సంజీవ్‌కుమార్‌

ఎమ్మిగనూరు/గోనెగండ్ల/నందవరం/మంత్రాలయం/కోసిగి, ఏప్రిల్‌ 17:

స్వర్ణాంధ్ర సాకార యాత్రకు ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గ ప్రజలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. బాలకృష్ణ రాకతో రెండు నియోజకవర్గాల టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగ మంగళవారం బాలకృష్ణ రోడ్‌షో నిర్వహించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోకి వేముగోడు దగ్గర అడుగుపెట్టిన ఆయనకు ప్రజలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి హెచ్‌.కైరవాడి, గోనెగండ్ల, రాళ్లదొడ్డి, ఎర్రకోట మీదుగ ఎమ్మిగనూరు చేరుకున్నారు. పట్టణంలోకి చేరుకున్న బాలయ్యబాబుకు అడుగడుగునా ప్రజలు, అభిమానులు బ్రహ్మరథం పట్టారు.

శివ సర్కిల్‌లో గంటకు ముందుగానే భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు, బాలయ్య అభిమానులు చేరుకోవడంతో జనసంద్రంగా మారింది. బాలకృష్ణను చూసేందుకు మహిళలు, చిన్నారులు, యువకులు, నందమూరి అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో ప్రధాన వీధులన్ని జనమయంగా మారాయి.అలాగే చిన్నారులు టీడీపీ జెండాలను చేతపట్టుకొని బాలయ్య రోడ్‌షోలో విక్టరీ సింబల్‌ చూపుతూ బాలయ్యకు అభివాదం చేశారు. అలాగే ముస్లింమైనార్టీ నాయకులు బాలయ్యను ఘనంగా సన్మానించారు. అలాగే ముగతి, హలహర్వి పరిధిలో మంత్రాలయానికి వెళ్తుండగా ఆయా గ్రామాల ప్రజలు బాలయ్య అభిమానులు కేరింతలు కొడుతూ జై బాలయ్య జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు.

Updated Date - Apr 17 , 2024 | 01:19 AM