శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తులు
ABN , Publish Date - Mar 04 , 2024 | 03:12 AM
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని తెలంగాణ, మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు ఆదివారం దర్శించుకున్నారు.
తిరుమల, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని తెలంగాణ, మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు ఆదివారం దర్శించుకున్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సాంబశివరావు నాయుడు, మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకటరమణ ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో వేర్వేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వారికి రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు.