Share News

గుంటూరు జీజీహెచ్‌లోనే దాడికి తెగబడ్డారు!

ABN , Publish Date - May 16 , 2024 | 04:14 AM

గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రి అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతున్న వారిపై మంగళవారం రాత్రి గంజాయి మత్తులో ఉన్న యువకులు దాడి చేసి కలకలం సృష్టించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న

గుంటూరు జీజీహెచ్‌లోనే దాడికి తెగబడ్డారు!

భయంతో పరుగులుతీసిన జీజీహెచ్‌ సిబ్బంది

గంజాయి మత్తులో దాడి చేసిన యువకులు!

గుంటూరు మెడికల్‌, మే 15: గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రి అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతున్న వారిపై మంగళవారం రాత్రి గంజాయి మత్తులో ఉన్న యువకులు దాడి చేసి కలకలం సృష్టించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులపై.. ప్రత్యర్థులు వైద్య సిబ్బంది సమక్షంలోనే మరోసారి దాడికి దిగారు. వివరాల్లోకి వెళితే..గుంటూరు కేవీపీ కాలనీకి చెందిన మున్నా కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం అదే ప్రాంతానికి చెందిన ప్రభు అనే వ్యక్తిని బావా బాగున్నావా? అంటూ మున్నా పలుకరించాడు. ఎవడ్రా.. నీకు బావ? అంటూ ప్రభు గొడవకు దిగాడు. స్ధానికులు సర్ది చెప్పి పంపేశారు. ఆతర్వాత మున్నా తన తమ్ముడైన హనీ్‌ఫతో కలసి కృష్ణబాబుకాలనీలో కారు పార్కింగ్‌ చేసి, మద్యం తాగారు. ఆసమయంలో ప్రభు, కోటి, ప్రవీణ్‌, లచ్చి తదితరులు కర్రలు, ఇనుప రాడ్లతో అక్కడకు వచ్చి సోదరులిద్దరిపై విచక్షణరహితంగా దాడి చేశారు. కొందరు యువకులు అడ్డుకునేందుకు రాగా, వారిపై కూడా దాడి చేశారు. గాయపడిన మున్నా తదితరులను మంగళవారం రాత్రి గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రికి తరలించారు. ప్రభు, అతడి స్నేహితులు రాత్రి ఆసుపత్రికి వచ్చి బాఽధితులపై మరోసారి దాడి చేశారు. కొంతసేపు ఆసుపత్రిలో అలజడి సృష్టించారు. నగరంపాలెం ఎస్‌ఐ రవీందర్‌నాయక్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - May 16 , 2024 | 04:14 AM